కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం చేస్తారనే ప్రచారంపై మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. 'కాంగ్రెస్ పార్టీ జగన్ను 16 నెలలు జైలులో పెట్టింది. అలాంటి పార్టీలో ఎలా చేరుతారు. కావాలనే కొందరు పిచ్చి రాతలు రాస్తున్నారు. మరోసారి ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లి నుంచే ప్రజల కోసం జగన్ పోరాటం చేస్తారు' అని అన్నారు.