AP: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ విజయాలను చూసి జగన్కు మతిస్థిమితం కోల్పోయిందని, ఈ-పంట నమోదుపై ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలకు జగన్ అంబాసిడర్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఈ-పంట నమోదు గణనీయంగా పెరిగిందని, రబీ 2025-26లో 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తయిందని మంత్రి తెలిపారు.