AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల X (ట్విట్టర్) ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా మారారని ఆరోపించారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని, ఇప్పుడు జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారని సెటైర్లు వేశారు. సంక్షేమానికి సారథి వైఎస్సార్ అని కొనియాడుతూ, ఆయన పథకాలు ప్రజల కష్టం నుంచి పుట్టాయని షర్మిల వెల్లడించారు.