AP: రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ కుట్రలు చేస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రాజాం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రగతిని కళ్లారా చూస్తున్నామని ఆయన అన్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకమని అన్నారు. రాష్ట్ర పరువును ఢిల్లీలో తీసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. అభివృద్ధిలో ఏపీ అగ్రస్థానానికి చేరుకుంటుందని ప్రధాని మోదీ ప్రశంసించారని అన్నారు.