AP: వైఎస్ జగన్ డిసెంబర్ 18న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ కానున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించిన పత్రాలను గవర్నర్కు అందజేయనున్నారు. ఈ భేటీలో జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, ఎంపీలు కూడా ఉంటారు. దీనికి ముందు ఉదయం 10 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి రాజ్ భవన్కు పంపనున్నారు.