AP: మెగా డీఎస్సీలో స్కామ్ జరిగిందని వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘జగన్.. మీ బాధ, ఆక్రోశం అర్థం చేసుకోగలను. మేము 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. త్వరలోనే మరో డీఎస్సీ ఇవ్వబోతున్నాం. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అవమానించారు. ఎంపికైన టీచర్లకు మీరు క్షమాపణ చెప్పాలి’ అని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు.