AP: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణకు హైకోర్టులో ఊరట లభించింది. అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వేకోడూరు పోలీసులు నమోదు చేసిన కేసులో బాధితురాలికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 గంటలలోపు సంబంధింత పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని తెలిపింది. సాక్షులను భయపెట్టడం, ప్రలోభపెట్టడం చేయకూడదని సూచించింది.