AP: తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులోని 24వ మలుపు వద్ద అదుపుతప్పి జీపు రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. శ్రీవారి దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.