AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కుమారులు సిట్ (సిట్) ఎదుట విచారణకు హాజరయ్యారు. రమేష్ కుమారులు రాజీవ్, రోహిత్.. రాము కుమారులు రాకేశ్, రామ్మోహన్ సిట్ కార్యాలయానికి వచ్చారు. జోగి రమేష్, రాము అరెస్ట్ సమయంలో లభించిన ల్యాప్టాప్ ఆధారంగా అధికారులు వారిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.