AP: మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్ను అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. మొంథా తుఫాన్ వల్ల రైతులు నష్టపోయారని, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారని, ఈ ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనలో 90 ఏళ్ల వ్యక్తిపై కేసు పెట్టారని, అయితే తిరుమల, సింహాచలంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.