ముగిసిన టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశం

AP: టీటీడీ, దేవాదాయ శాఖ సంయుక్త సమావేశం ముగిసింది. దేవాదాయ చట్టం ప్రకారం 9% శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. అర్చక నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని మేనిఫెస్టోలో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 590 మంది వేదపండితులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇక టీటీడీలో అన్యమతస్తులు ఉన్నారన్నది అవాస్తవమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్