జమ్మలమడుగు: ఈనెల15 నుంచి మహిళలకు ఫ్రీ బస్సు: సీఎం చంద్రబాబు

ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. "స్త్రీ శక్తి" పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఇది ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు, వారి స్వేచ్ఛ, భద్రతకు తోడ్పడేలా రూపొందించామని సీఎం వెల్లడించారు. ప్రయాణ సందర్భాల్లో మహిళలకు తగిన గుర్తింపు కార్డు ఉంటే RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్