వల్లూరులో ఆదివారం అంకాలమ్మ తల్లి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం భక్తులు కుంకుమ బండ్లు, బోనాలతో అమ్మవారికి మొక్కులు సమర్పించారు. సాయంత్రం జరిగిన బండలాగుడు పోటీలు, చెక్కభజన కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.