అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంతో వైవీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో విద్యార్థులు, అధ్యాపకులు గురువారం స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. హెచ్వోడీ డా. పి. సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఈ నిర్ణయం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. సాయంత్రం క్యాంపస్లో దీపాలు వెలిగించి అమరజ్యోతి నిర్వహించనున్నారు.