కడప నగర ప్రధాన కూడళ్లలో భగత్ సింగ్, బి. పి. మండల్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. ఎం. ఓబులేసు యాదవ్ మంగళవారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం ఇచ్చారు. జంతువుల బొమ్మల కన్నా, దేశం, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తే నేటి యువతకు మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.