భారతీయ వారసత్వ సంపదను కాపాడే లక్ష్యంతో, వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు శుక్రవారం వల్లూరు మండలం పుష్పగిరి ఆలయాల్లో క్షేత్ర పర్యటన చేశారు. డా. మృత్యుంజయ రావు మార్గదర్శకత్వంలో, విద్యార్థులు చోళుల నుండి విజయనగర రాజుల కాలం నాటి వాస్తు, శిల్పకళా శైలులను అధ్యయనం చేశారు. ఈ చారిత్రక కట్టడాల శిల్ప సౌందర్యాన్ని తమ చిత్రాల ద్వారా ఆవిష్కరించి, కళాభిరుచిని, సంస్కృతిపై మక్కువను ప్రదర్శించారు.