నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి: అన్నమయ్య జిల్లా పోలీసులు

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ప్రజల రక్షణ, చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. సైబర్ మోసాలు, సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తూ, 'డిజిటల్ అరెస్ట్' బెదిరింపులకు భయపడవద్దని, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని సూచించారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించారు. బాల్య వివాహాలు, మహిళలపై వేధింపుల సమాచారాన్ని వెంటనే 100/112కు తెలియజేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్