మదనపల్లిలోని ట్రెజరీ కార్యాలయంలో బుధవారం లక్ష రూపాయల నగదు చోరీకి గురైంది. ట్రెజరీ కార్యాలయానికి నగదుతో వచ్చిన శ్రీనివాసులును ఓ దొంగ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురమ్మని చెప్పి, ఆ సమయంలో నగదును అపహరించి పరారయ్యాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.