ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో జననీరాజనాలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.