కురబలకోట: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం. కెవిపల్లి మండలం గరిమెట్టకు చెందిన రైతు మునిరత్నం కురబలకోట మండలం, కంటేవారిపల్లెకు సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లిలో 5 ఎకరాల భూమిని లీజుకు తీసి, టమాటా సాగు చేశాడు. పొలం వద్దకు స్వగ్రామం నుండి బైకులో వెళుతుండగా కంటేవారిపల్లె వద్ద టాటా ఏస్ ఢీకొని తీవ్రంగా గాయపడగా మదనపల్లి కు తరలించారు.

సంబంధిత పోస్ట్