శనివారం కొత్తకోట మండలంలో జనుపువారిపల్లి గ్రామంలో వెంకటరమణ భార్య పార్వతమ్మ, కుమారుడు ప్రభాకర్లను ఇంట్లో ఉన్నప్పుడు నాగుపాము కాటు వేసింది. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో తిరుపతికి రిఫర్ చేశారు.