మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్

మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును సోమవారం పర్యటించారు. వ్యాపారులు కాయలు కొనుగోలు చేసే విధానాన్ని పరిశీలించి, దిగుబడి పెరగడం వల్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మదనపల్లి మార్కెట్ యార్డును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, రైతులకు మేలు చేసేలా కీలక సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న ఈ యార్డును అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామని ఛైర్మన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్