చౌడేపల్లె మండలం ఎల్లకుంట్ల గ్రామానికి చెందిన సుబ్రమణ్యం (46) మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి, బుధవారం ఉదయం మళ్లీ మద్యం సేవించి మత్తులో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.