మదనపల్లె మండలానికి చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు శుక్రవారం రాత్రి ఈశ్వరమ్మ కాలనీకి బైకులో వెళ్తుండగా, మిలాన్ ఫంక్షన్ హాల్ వద్ద ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్ను వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాలూకా ఎస్సై చంద్రమోహన్ సంఘటనపై వివరాలు సేకరించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.