అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ అభి వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంలో, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, యువతకు అండగా నిలవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందున పార్టీ శ్రేణులు ఆయన్ను "ట్రబుల్ షూటర్"గా అభివర్ణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న మిథున్ రెడ్డి సేవలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు.