చాపాడు మండలం నక్కలదిన్నె పీహెచ్సీ, ఏడు ఆయుష్మాన్ కేంద్రాల పరిధిలో 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు విజయవంతంగా వేశారు. అల్లాడుపల్లెలో డిప్యూటీ డీఎంహెచ్వో మల్లేష్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. ఓబులేసు కుందూనది పరిసరాల్లోని చిన్నారులకు చుక్కలు వేశారు. ఈవో రాఘవయ్య కేంద్రాలను పర్యవేక్షించారు. ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.