దువ్వూరు మండలంలోని క్రీస్తురాజాపురం వద్ద శనివారం బైక్ను టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో రాజుపాలెం వాసులు బాలనాగయ్య, హుస్సేనయ్య గాయపడ్డారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాలనాగయ్య మృతి చెందినట్లు ఎస్సై వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి టిప్పర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.