మైదుకూరులో కడప జిల్లా రైతు సేవా సమితి 2026 సభ్యత్వ నమోదును జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ ప్రారంభించారు. పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్ నుంచి తొలి సభ్యత్వం స్వీకరించారు. రాజకీయాలకు అతీతంగా రైతుల పక్షాన పోరాడుతున్న ఈ సమితిని బలోపేతం చేసేందుకు రైతులంతా సభ్యత్వం తీసుకోవాలని రమణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాశరెడ్డిగారి సుబ్బరాయుడు, షామీర్ భాష, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.