బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కడప జిల్లాలో కురుస్తున్న చిరుజల్లులు శనగ రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, రాజుపాలెం, ముద్దనూరు, కొండాపురం వంటి మండలాల్లో వేలాది ఎకరాల్లో శనగ పంట సాగవుతోంది. ప్రస్తుతం పంట బాగానే ఉన్నప్పటికీ, ఈ అకాల వర్షాల వల్ల పంటకు పులుపు వచ్చి, పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.