వాల్మీకిపురంలో 18 రోజుల పాటు జరిగిన చిత్తూరు ప్రీమియర్ క్రికెట్ లీగ్ (సీపీఎల్) సీజన్-2లో పాయ్ వైస్రాయ్ తిరుపతి జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన వైస్రాయ్ జట్టు 177 పరుగులు చేయగా, ఎన్కే స్పోర్ట్స్ జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 51 పరుగుల తేడాతో గెలిచిన వైస్రాయ్ జట్టుకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సీపీఎల్ ట్రోఫీని అందజేశారు.