ప్రొద్దుటూరులో పర్యటించిన మంత్రి పార్థసారథికి హౌసింగ్ శాఖలో జరిగిన రూ. 104 కోట్ల అక్రమాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. డ్వాక్రా లబ్ధిదారుల నుంచి మెప్మా సిబ్బంది రూ. 38 కోట్లు, కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి రూ. 62 కోట్ల బిల్లులు తీసుకున్నారని, అధికారులు రూ. 2 కోట్ల మెటీరియల్ ఇవ్వకుండానే రికార్డుల్లో నమోదు చేశారని, రూ. 1.70 కోట్ల విలువైన స్టీల్ కడ్డీలు చోరీ అయ్యాయని బాధితులు ఎమ్మెల్యే, మంత్రికి వివరించారు.