ప్రొద్దుటూరులోని స్థానిక విజయనగరం వీధిలోని బేతానియా చర్చిలో గొడవలు పడి, శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే చర్యలు తప్పవని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ శనివారం హెచ్చరించారు. చర్చికి సంబంధించిన 14 మంది సభ్యులను తహశీల్దార్ వద్ద బైండోవర్ చేయించారు. చర్చి ఫాస్టర్ నియామకం వివాదంపై అభ్యంతరాలను న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని సూచించారు. గొడవపడినా, ప్రేరేపించిన వారిపై చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.