ప్రొద్దుటూరు పప్పుల బజారులోని గంగమ్మ దేవాలయంలో అమ్మవారి పునఃప్రతిష్ట ఉత్సవాలు సోమవారం నుంచి బుధవారం వరకు మూడురోజుల పాటు జరుగుతున్నాయి. సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ఠతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో మంగళవారం అమ్మవారి విగ్రహ గ్రామోత్సవం, బుధవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు సత్య కుమార్, ఆనం రామనారాయణరెడ్డి, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.