ప్రొద్దుటూరులోని అగస్త్యేశ్వరాలయంలో కుంభాభిషేకం నిర్వహించడానికి రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ బుధవారం అనుమతులు జారీ చేశారు. స్వామి, అమ్మవార్ల ఆలయాల విమాన శిఖరాలు, బింబములు జీర్ణావస్థకు చేరడంతో వాటి పునరుద్ధరణ, నవీకరణ పనుల కోసం ఈ కుంభాభిషేకం చేపట్టనున్నారు. ఆలయ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు, భక్తుల సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహణకు అనుమతి లభించింది.