ప్రొద్దుటూరు శ్రీ వేంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఈ నెల 30న కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. హైదరాబాద్లోని జాతీయ మాంస పరిశోధన సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సుస్థిర పశు ఉత్పాదన, పాలపోషణకు సంబంధించిన యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలతో ముఖాముఖి సమావేశం ఉంటుంది. వివిధ శాఖల నుంచి స్టాళ్లను ఏర్పాటు చేస్తారు.