ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, సోమవారం పులివెందులలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నుండి పూల అంగళ్ళ కూడలి వరకు విద్యార్థులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఖాజా మోయిద్దీన్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డాక్టర్ నవీన్, మెడికల్ ఆఫీసర్ శాంతకుమార్ ఈ ర్యాలీని ప్రారంభించారు. హెచ్ఐవి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.