మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా, పులివెందుల పట్టణంలోని పార్నపల్లె రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం పాలాభిషేకం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మురళి తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల నుండి సాయిబాబాకు పాలాభిషేకం జరుగుతుందని, భక్తులు తమ వెంట పాలు తీసుకురావాలని ఆయన సూచించారు. ఆలయంలో వివిధ రకాల పూజలు, హోమాలు కూడా జరుగుతాయని, భక్తులు ఈ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.