వేంపల్లి పంచాయతీలో జులై 7న పకీరుపల్లెకు చెందిన సుమియా అనే బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో మడకబాబుపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు శనివారం డీఎస్పీ మురళీ తెలిపారు. వేంపల్లి స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ బాలిక అదృశ్యమైన విషయంపై సుమియా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు మడకబాబుపై పోక్సో కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కు తరలించారని డీఎస్పీ తెలిపారు.