వేముల: యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు

గొందిపల్లెలో శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ఓబులేసు ఆధ్వర్యంలో శనగ పంట కోత ప్రయోగం జరిగింది. ఈ సందర్భంగా, యాజమాన్య పద్ధతులు పాటిస్తే శనగ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చని ఏవో ఓబులేసు తెలిపారు. 25 మీటర్ల విస్తీర్ణంలో పండిన శనగ గింజలను తూకం వేయగా 4.250 కిలోలు వచ్చాయని, నీటిలో విత్తనశుద్ధి చేయడం వల్ల పంట దిగుబడి పెరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్