వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ విమర్శలు చేసారు. వైసీపీ పాలనలో ఆర్బీకేలు అప్రమత్తంగా ఉండేవని, ప్రతి పంటకు ఈ-క్రాప్ నమోదు జరిగేదని గుర్తుచేశారు. ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా కలిగించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులను విస్మరించిందని, ఇన్పుట్ సబ్సిడీ లేకపోవడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం మానవ తప్పిదమని అన్నారు. "చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.