సీఎంఆర్‌ఎఫ్ గోల్మాల్ ఆరోపణలపై విచారణకు ఆదేశం

నందలూరు మండలంలో సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలపై నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గురువారం తీవ్రంగా స్పందించారు. పేదల కోసం ఉన్న సీఎంఆర్‌ఎఫ్ నిధులను ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. గత రెండు రోజులుగా వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించి నిజానిజాలను బయటపెడతామని, పేదల హక్కులను దెబ్బతీసే చర్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్