ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో నివసిస్తున్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బుధవారం విజ్ఞప్తి చేశారు. వదంతులను నమ్మకుండా కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే పాటించాలని, అత్యవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఏదైనా ఇబ్బంది తలెత్తితే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. అందరూ సురక్షితంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.