రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ, ప్రపంచానికి అన్నం అందించే రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజంపేట మండలం మందరం గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు ఆధునిక వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.