రాజంపేట మండలం ఊటుకూరు వద్ద తిరుపతి-కడప జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు న్యాయవాదులు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతికి తిరిగి వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడినవారిని రాజంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.