సోమవారం తంబళ్లపల్లెలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. చిరుజల్లుల కారణంగా వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. హరీశ్ కుమార్, వినయ్ కుమార్ అనే యువకులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. హరీశ్ కుమార్ ను మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు తరలించారు. పోలీసులు సంఘటనపై విచారణ చేస్తున్నారు.