నెల తిరగకముందే బీటలు వారిన రోడ్డు

కిర్లంపూడి నుంచి ప్రత్తిపాడు వెళ్లే రూ. 2 కోట్ల ఆర్‌అండ్‌బీ నిధులతో నిర్మించిన ప్రధాన రహదారి, నిర్మాణం పూర్తై నెల తిరగకముందే బీటలు వారడంపై ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు. నాణ్యత లోపించడం వల్లే ఇలా జరిగిందని, దీంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడమే కాకుండా ప్రయాణం కూడా కష్టతరంగా మారిందని వారు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్