పేరూరులో మానసిక రుగ్మతతో బాధపడుతున్న కుమారుడు రవితేజ (35) ఆత్మహత్య చేసుకోగా, అతని మృతదేహాన్ని చూసిన తండ్రి సూర్యనారాయణమూర్తి (62) గుండెపోటుతో మరణించారు. పదవీ విరమణకు రెండు నెలల ముందు ఉపాధ్యాయుడైన సూర్యనారాయణమూర్తికి ఈ విషాదం ఎదురైంది. విరిగిన చేతితోనే చిన్న కుమారుడు అంత్యక్రియలు నిర్వహించడం అందరినీ కలచివేసింది.