అమలాపురం మండలం బండారులంక పీహెచ్సీలో జిల్లాస్థాయి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం జేసీ వైఖోం నైదియాదేవి, డీఎంహెచ్ఓ దుర్గారావు దొర ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జేసీ కోరారు. జిల్లాలో 766 కేంద్రాల ద్వారా 1, 35, 688 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు 1, 549 బృందాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రాలేకపోయిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కల మందు వేస్తారని తెలిపారు.