అనపర్తి: ఘనంగా మహర్నవమి పూజలు

మహర్నవమి సందర్భంగా అనపర్తి పాతఊరులోని త్రిశక్తి పీఠం శుక్రవారం రాత్రి దుర్గమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని మాల ధారణ ధరించిన భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు దేవతామూర్తుల వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిషాసురుడి వద ప్రదర్శన ప్రత్యెక ఆకర్షణగా నిలిచింది.

సంబంధిత పోస్ట్