విజయదుర్గా పీఠం వద్ద సరస్వతి దేవికి పూజలు చేసిన విద్యార్థులు

అనపర్తి పాత ఊరులోని ఉమామహేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విజయ దుర్గా పీఠం వద్ద బుధవారం అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్